Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : కోదండరాం

ఉపాధ్యాయల కేటాయింపులో శాస్త్రియత లేదని, ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకవచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఫ్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.జీవో317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ హనుమకొండలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం,బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టీపీటీఎఫ్‌,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందన్నారు. ఉపాధ్యాయులను స్థానికంగా కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ చాలా మంది ఉపాధ్యాయులను వేరే వేరే జిల్లాలో విసిరేశారని మండిపడ్డారు. 317 జీవో ను రద్దు చేయాలని,ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img