Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా సీఎం కేసీఆర్‌ వెంటే..

: మంత్రి జగదీశ్‌ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా సీఎం కేసీఆర్‌ వెంటే నడుస్తోందని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలతో మరోసారి స్పష్టమైందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపునకు సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టామన్నారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమైన శక్తిగా మారిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img