11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 11మంది హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహిచుకున్నారు. వీరిలో 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని చికిత్స నిమిత్తం ఐసోలేషన్ కు తరలించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,673 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.