Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎందుకు ఈ నష్టాల డ్రామా?.. : షర్మిల

ఆర్టీసీని తమ అనుచరులకు అప్పగించేందుకు కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారని షర్మిల ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని చెప్పుకునే కేసీఆర్‌…సీఎం పదవిలో ఉండి ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఛార్జీల పెంపునకు తయారయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు. ఎందుకు ఈ నష్టాల డ్రామా?… రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా?.. మీరు తలుచుకొంటే ఆర్టీసీ నష్టాలను పూడ్చడం కష్టమా’’? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img