ప్రజాసంగ్రామయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాధావిధిగా భద్రకాళి ఆలయం వరకు కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలిస్తున్న క్రమంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసంగ్రామయాత్ర కొనసాగి తీరుతుందన్నారు.