మంత్రి హరీష్రావు
టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి హుజురాబాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను బీజేపీ కార్లతో తొక్కి చంపేస్తోందని అన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. గ్యాస్ పై రూ.291 పన్ను విధించినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.