ఎన్నికల విధుల్లో మరణించేవారి కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి 15 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఎన్నికల విధుల్లో ో తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల చర్యలతో మరణిస్తే.. ఇచ్చే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. శాశ్వత అంగవైకల్యం ఏర్పడేవారికి రూ.7.50 లక్షల పరిహారం అందించనుంది.