Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మునుగోడు నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఇక మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించటంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105కు చేరింది. ఆరుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ బలం రాజగోపాల్‌రెడ్డి ఓటమితో ఐదుకు పడిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img