Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలు తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా బెయిల్‌ పిటిషన్‌ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల బెయిల్‌ పిటిషన్‌ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అదేవిధంగా నిందితుల రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ పిటిషన్‌ ను న్యాయస్థానం రేపు విచారించనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img