Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆదేశించింది. మీడియా, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడిరచొద్దని సూచించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ఈ నెల 29న సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీబీఐతో కేసు విచారణ జరిపించాలని భాజపా నేత ప్రేమేందర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img