ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా (వీూజ) ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన చాంబర్లో నూతన ఎమ్మెల్సలీలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు.