Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ కవితని ఆహ్వానించిన.. ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ ప్రతినిధులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ ప్రతినిధులు ఆహ్వానం పలికారు. దాంతో వచ్చేనెల 2, 3 తేదీల్లో కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ లో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్‌ సమావేశాలను జనవరి 1న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img