Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎలాంటి విచారణకైనా సిద్ధం : డీకే అరుణ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీజేపీ సీనియర్‌ నేత డీకే అరుణ స్పష్టం చేశారు. శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర.. ఒక బోగస్‌ అని అన్నారు. ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరకీ లేదన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మంత్రి తాపత్రయ పడ్తున్నారని అన్నారు.మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షల్టర్‌ ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర వెనుక… ప్రశాంత్‌ కిషోర్‌ కుట్ర ఉందని ఆరోపించారు. ‘ఇది బెంగాల్‌ కాదు.. పీకే వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. నీకు భార్య, పిల్లలున్నారని కేసీఆర్‌ గుర్తుంచుకోవాలి. మహిళాగా కేసీఆర్‌ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతాను. పులిలా ఉండే పోలీస్‌ ఆఫీసర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. పిల్లిలా మారటం బాధాకరం’ అని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img