Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎల్లుండి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం


వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ నెల 20 నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లపై లోటస్‌ పాండ్‌లో రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.చేవెళ్ళలో బుధవారం ఉదయం 11 గంటలకు షర్మిల భారీ భహిరంగ సభ జరగనుంది. అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్రలో 9 భారీ భహిరంగ సభలు షర్మిల నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img