ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్పై మండిపడ్డారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదన్నారు. అది గిఫ్ట్ కాదు అని కవిత పేర్కొన్నారు. మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని అన్నారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని కవిత పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఠాగూర్కు కవిత సూచించారు.