Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.చాలా ఏండ్లుగా పెండిరగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. అలాగే రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు ఇదే అంశంపై నోటీసులు ఇచ్చారు. వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img