Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే..’

ఎమ్మెల్సీ కవిత రాసిన ‘కవిత’
హిజాబ్‌ వివాదంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్‌ ధరించడం ముస్కాన్‌ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని కవిత సూచించారు.ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్‌..
మతమేదైనా సరే
మనమంతా భారతీయులమే..
సిందూర్‌-టర్బన్‌-హిజాబ్‌-క్రాస్‌
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే
‘త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
‘జై హింద్‌’ అని నినదించిన అబిద్‌ హసన్‌ సఫ్రానీ అయినా..
‘సారే జహాన్‌ సే అచ్చా హిందూస్తాన్‌’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్‌ ఇక్బాల్‌ అయినా..
‘జన గణ మన’తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా మనమంతా భారతీయులమనే.. !!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img