Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,641 పరీక్షలు చేయగా 1,546 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1970008కు చేరింది. కరోనాతో మరో 15 మంది ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,410కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,968 మంది వ్యాధి బారి నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1936016కు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img