Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏపీలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. కాళేశ్వరం తరహాలో పోలవరం : మంత్రి మల్లారెడ్డి

కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారని, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కేవలం ఎనిమిదేళ్లలో అభివృద్ధి చేసిన కేసీఆర్‌.. అన్ని రాష్ట్రాలకు మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చారన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో విజయం సాధించి కేసీఆర్‌ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img