Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేది

కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపుపై మంత్రి కేటీఆర్‌

పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గృహ వినియోగ సిలిండర్‌ ధరలను పెంచిన సమయంలోనూ కేటీఆర్‌ కేంద్రాన్ని తప్పుపడుతూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.తాజాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధరల పెంపుపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని కేటీఆర్‌ ఎద్దెవా చేశారు. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ. 250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 2,253కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img