Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతివనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్ౌ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img