మంత్రి హరీశ్రావు
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ విధానాలు బయటపడ్డాయని మంత్రి హరీశ్రావు అన్నారు. పెట్రోలు, సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడు కుదేలవుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికితోడుగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ప్రజలకు మరింత భారంగా మారాయన్నారు. కరోనా సంక్షోభంతో ఆదాయం కోల్పోయిన ప్రజలను అధిక ధరలు మరింత అప్పుల్లోకి, కష్టాల్లోకి నెడుతున్నాయని అన్నారు.