Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న మంత్రి, ఐటీ అధికారులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు ముగిశాయి. హైదరాబాద్‌ ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్నాటక నుంచి వచ్చిన 400 మంది.. 65 బృందాలుగా విడిపోయి రెండురోజులపాటు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐటీ శాఖ తనిఖీల నుంచి తాఖీదులదాకా వెళ్లింది. ఇప్పుడు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. మల్లారెడ్డి.. ఆస్పత్రికి పరుగులు పెట్టి ఐటీ అధికారి రత్నాకర్‌ని వెంటపెట్టుకొచ్చారు. అదే సమయంలో ల్యాప్‌టాప్‌, ఫోన్లు లాక్కున్నారన్నది ఐటీ అధికారుల ఆరోపణ. కాసేపటికి ల్యాప్‌టాప్‌ తెచ్చిఇచ్చినా దాన్ని ఐటీ సిబ్బంది తీసుకోలేదు. పైగా.. అసలు అది తమ ల్యాప్‌టాప్‌ కాదని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటికీ ఆ ల్యాప్‌టాప్‌ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మంత్రి మల్లారెడ్డిపై ఐదు అంశాల్లో ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌ ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వంద కోట్లు దొరికినట్లు నకిలీ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తనపైనే బలవంతం చేస్తే హాస్పిటల్‌లో ఉన్న తన కుమారుడి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. వందకోట్ల అక్రమ డొనేషన్ల టాపిక్‌పై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు డాక్యుమెంట్లు తయారు చేశారన్నారు. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ ఫోన్లు లాక్కున్నారని ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు చేశారు. బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఐటీ అధికారి రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇలా ఐటీ అధికారిపై మంత్రి మల్లారెడ్డి, మల్లారెడ్డి పై ఐటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img