మంత్రి హరీష్రావు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో ప్రాణభయం లేదని..ప్రజలు ఆందోళన చెందొద్దని..మంత్రి హరీష్రావు అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు.కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫస్ట్డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తైందని వెల్లడిరచారు. అలాగే రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చినట్లు వెల్లడిరచారు. ప్రజలంతా మాస్కులు.. భౌతికదూరం పాటించాలని మంత్రి హరీష్రావు కోరారు.