Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఒమిక్రాన్‌ టెన్షన్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్‌ నెలకొంది. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళ రిపోర్టు శుక్రవారం రానున్న క్రమంలో టెన్షన్‌ నెలకొంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారందరినీ సర్వేలెన్స్‌లో పెట్టారు. ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు నిబంధనలు కఠినం చేయడంతో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.అనుమానితుల శాంపిల్స్‌ను వైద్యులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో 10 మందికిపైగా పాజిటీవ్‌ వచ్చినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. డీఎంహెచ్‌వో కుమారుడు ఇటీవల జర్మనీ నుంచి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారని అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img