Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు..

ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నేతలు తెరలేపారని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. అదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టుపెట్టగా వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొనే కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు. దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తున్నదని.. సీఎం కేసీఆర్‌ ముందు బీజేపీ కుప్పిగంతులు సాగవని అన్నారు.చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కో ఎమ్మెల్యే కు రూ. 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని చేసిన కుట్ర బట్టబయలు అవడంతో బీజేపీ నీచ రాజకీయం తేటతెల్లం అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డిని బీజేపీ కొనుగోలు చేసినట్లు తమ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img