Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలు జరపలేదు : అమిత్‌ షా

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరిపేందుకు సాహసించలేదని ఆరోపించారు. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ ఏడాది విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించినట్టు వెల్లడిరచారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్‌షా పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. వేడుకల్లో అమిత్‌షాతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అమిత్‌షా.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాంతంత్య్రం వచ్చిందని అమిత్‌ షా గుర్తుచేశారు. దేశమంతటికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్‌ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సర్దార్‌ పటేల్‌ కృషి వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలు విముక్తి పొందారని పేర్కొన్నారు. నిజాం, రాజాకార్ల ఆగడాలకు ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ పటేల్‌ ముగింపు పలికారని వివరించారు. నాడు సైనిక చర్య 109 గంటల పాటు అవిశ్రాంతంగా జరిగిందన్నారు. హైదరాబాద్‌ స్వాతంత్య్రం కోసం ఎందరో సైనికులు ప్రాణాలు అర్పించారని తెలిపారు.
‘నిజాం పాలనలో గ్రామాల్లో రజాకార్లు హత్యలు, మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయి. జలియన్‌వాలాబాగ్‌ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగింది. పటేల్‌ చొరవ వల్లే ఇదంతా సాధ్యమైంది. పటేల్‌ లేకపోతే.. తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేది. తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలు జరపలేదు. ఏ భయం లేకుండా వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నా.’ అని అమిత్‌షా ప్రసంగించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img