ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచుతున్నట్లు తెలిపారు సీఎం.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందన్నారు.ఇక స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుంది.గ్రూప్ -1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా వెల్లడిరచారు.