కంటి వెలుగు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆర్ ఎక్స్ గ్లాసులు రెండు వారాల్లో ప్రజలకు అందుతాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.