మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 750 మెగావాట్ల సోలార్సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ సోలార్ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 483 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన సోలార్ ప్రీమియం ఎనర్జీస్ అభినందిస్తున్నట్టు తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా రికార్డు స్థాయిలో పరిశ్రమను స్థాపించి పనిచేయడం జరిగిందని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ పరిశ్రమలకు అదనంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో రెండు వేల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.