ఈనెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు సోమవారం నుంచి వెబ్సైట్లో హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని, వీటిపై ఎలాంటి సంతకాలు.. స్టాంప్ అవసరం లేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, . అన్ని రకాల కరోనా జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్ష రాసేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందేనని అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 70 శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. క్వశ్చన్ పేపర్లోనూ.. సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలకు ఛాయిస్ పెంచామన్నారు. ఇప్పటికే బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ప్రతీ కాలేజ్కు పంపించామని తెలిపారు.