Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. బి.1.1.259 వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కరోనా భయం వెంటాడుతోంది. కాగా మేడ్చల్‌ జిల్లాలోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. దీంతో యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img