Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను వదిలిపెట్టి.. ప్రజా సమస్యలను పరిష్కరించాలి

దేశానికి కావాల్సింది కశ్మీర్‌ ఫైల్స్‌ కాదు.. డెవలప్‌మెంట్‌ ఫైల్స్‌ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను వదిలిపెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించడానికే కశ్మీర్‌ ఫైల్‌ సినిమాను ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్‌ ఫైల్స్‌ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జరుగుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img