పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యుల రక్షణ కోసం 2 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెస్కు పోటీనే కాదని అన్నారు. తెల్ల దొరల నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రాజభరణలు రద్దు చేసిందని, బ్యాంక్లు జాతీయం చేసిందని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని, ఐటిని అభివృద్ధి పరిచి కంప్యూటర్, సెల్ను అందరికీ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని అన్నారు.తెలంగాణలో 30లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాకు మాటిచ్చామన్నారు. ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని తెలిపారు. నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ ఉంటుందన్నారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు.