Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్లీ షోకాజ్‌ నోటీసు..

తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం శుక్రవారం నాడు మరోసారి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీలోపుగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధిష్టానం గతనెల 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో తనకు నోటీస్‌ అందలేదని పార్టీ కార్యవర్గం తెలిపింది. తాజాగా హైదరాబాద్‌ తిరిగి రావడంతో కాంగ్రెస్‌ పార్టీ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడైనా నోటీసుకు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img