పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పోరాట భయంతోనే సీఎం కేసీఆర్ హడావుడిగా ఉద్యోగ ప్రకటనలు చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఖాళీలను ఎప్పుడు భర్తీ చేసేది చెప్పలేదని అన్నారు. గతంలో 1.07 లక్షల ఖాళీలు ఉన్నాయని, మరో 50 వేలు ఖాళీ అవబోతున్నాయని 2014 సెప్టెంబరు 7 చెప్పారన్నారు. 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. సభలో ఇవాళ కేసీఆర్ అబద్దాలు చెప్పారన్నారు. 80 వేల ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. మిగిలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకుపోయిందా అని ప్రశ్నించారు.