Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాంగ్రెస్‌, బీజేపీ.. హానికారక పార్టీలు : మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో అందోలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సిద్దన్న పాటిల్‌, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు నాగరాజు తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు. ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ సైతం ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే హైకమాండ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రజలు ఒకమారు ఆలోచించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img