కార్యకర్తలకు పోలీసులకు ఘర్షణ
విద్యుత్, చమురు ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యుత్ సౌధ, సివిల్ సప్లయిస్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టడిరచాలని ప్రయత్నించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పార్టీ నాయకులంతా ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్ళవలసి ఉంది. అయితే ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు నిర్వహించారు. అయినప్పటికీ నేతలు పోలీసులను నెట్టేస్తూ..ర్యాలీ లో పాల్గొన్నారు. మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎంతచెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్యఘర్షణ జరిగింది. తోపులాటలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కిందపడటంతో స్పృహతప్పి పడిపోయారు.ఆమెకు శ్వాస సమస్యలు ఉండటంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.వెంటనే ఆమెను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు.