గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢల్లీిలో సోనియమ్మ రాజ్యం వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతోందన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలూ తోడు దొంగలేనన్నారు..క్రమశిక్షణ కాంగ్రెస్లో ముఖ్యం. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దన్నారు. ‘మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లే. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్లో బందీ అయ్యింది. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది.’ అని అన్నారు.