Friday, April 19, 2024
Friday, April 19, 2024

కీరవాణి.. చంద్రబోస్‌లను సత్కరించిన.. తెలంగాణ గవర్నర్‌ తమిళి సై

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి..సినీ గేయ రచయిత చంద్రబోస్‌ లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సత్కరించారు. తెలంగాణ రాజ్‌ భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గవర్నర్‌ తమిళి సై సత్కరించారు. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయ రచయిత చంద్రబోస్‌లను సత్కరించారు. వీరిని శాలువతో సన్మానించి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అలాగే.. ఎన్జీవో భగవాన్‌ మహవీర్‌ వికలాంగ సహాయతా సమితి, పారా అథ్లెట్‌ కుడుముల లోకేశ్వరి, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆకుల శ్రీజ, సివిల్స్‌ శిక్షకురాలు బాలలతలను గవర్నర్‌ సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img