Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుక్క దాడిలో 9 మందికి గాయాలు

మనుషులపై కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఓ వీధి కుక్క ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసింది. గురువారం (ఫిబ్రవరి 23) ఉదయం యాచారంలోని ఎల్లమ్మ గుడి కాలనీలో సాగర్‌ రహదారిపై ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే బస్‌ స్టాప్‌ సమీపంలో నిలుచున్న వారిపై పిచ్చి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. బాధితుల్లో పలు గ్రామాలకు చెందిన వారున్నారు. స్థానికులు కర్రలతో వచ్చి అదిలించడంతో కుక్క పారిపోయింది. కుక్క దాడిలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే యాచారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురుని మెరుగైన చికిత్స కోసం ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img