Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కేంద్రం దిగి వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయి

: మంత్రి సత్యవతి
ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్నదాత నడ్డి విరుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలంతా రైతుకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం దిగి వచ్చి ఇక్కడ పండిరచిన బియ్యం మొత్తం కొనుగోలు చేసేందుకు హామీ ఇచ్చే వరకు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img