Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేంద్రమంత్రికి లేఖ రాసిన కేటీఆర్‌

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర సహకరించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు మరింత ఉతమివ్వాలన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకమైన పాత్ర పోషించిందన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడర్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటుగా హైదారాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడర్‌కు, హైదరాబాద్‌- విజయవాడ కారిడర్‌కు కూడా నిధులు ఇవ్వాలన్నారు.జడ్చర్లలో పారిశ్రామిక పార్క్‌లో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్ర ఏర్పాటు చేస్తామన్నారు. బ్రౌన్‌ ఫీల్డ్‌ మాన్యుఫ్యక్చరింగ్‌ క్లస్టర్లు మంజూరు అప్‌గ్రేడేషన్‌ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలన్నారు. హైదరాబాద్‌లో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. ఐటీఐఆర్‌ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ముఖ్యంగా చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img