Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది : మంత్రి ఎర్రబెల్లి

రైతుల కోసమే సీఎం కేసీఆర్‌ పోరాటం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా నిర్వహిస్తున్నది. ఇందులో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా అని ఎద్దేవా చేశారు. ు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, ప్రధాని మోదీ స్పందించిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. గత రెండేండ్లుగా కేంద్రం ధాన్యం కొనడం లేదని, ఇప్పటివరకు కొన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కొనుగోలుచేయడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img