కంద్ర ప్రభుత్వం వడ్లు కొనే వరకూ ఉద్యమిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి వేయమని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రా రైస్ కొనడం కాదు వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఖర్చులు భరిస్తుందని తెలిపారు. రైతులంటే బీజేపీ చీదరించుకుంటోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచాక గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడం బీజేపీ తన నైజం బయట పెట్టిందని అన్నారు.