Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశానికి మంత్రి హరీశ్‌రావు దూరం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశం జరుగుతోంది. ఢల్లీిలో శుక్రవారం జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు హాజరు కాలేదు. 2023- 24 బడ్జెట్టుపై కసరత్తులో భాగంగా.. బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రీ బడ్జెట్‌ సమావేశాలకు ఆయన గైర్హాజరవడం ఇది రెండో పర్యాయం. దీంతో రాష్ట్రం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సీఎం కేసీఆర్‌ ఏకంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంతో హరీష్‌ రావు బడ్జెట్‌ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img