Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేఆర్‌ఎంబీ : ఈ నెల 14లోగా నిర్ణయం వెల్లడిస్తాం

తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం మంగళవారం సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని ఏపీ అడుగుతోందని, ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. తమ నిర్ణయాన్ని కేంద్రానికి, ఏపీకి త్వరలో చెబుతామని, ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img