Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేబీసీ షోలో కేటీఆర్‌ ట్వీట్‌పై ప్రశ్న..

స్పందించిన మంత్రి
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్‌ రియాలిటీ షో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఎందరో హాజరయ్యారు.తాజాగా భారత మాజీ క్రికెటర్స్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌరవ్‌ గంగూలీ హాజరయ్యారు. వీరికి అమితాబ్‌..తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గతంలో చేసిన ట్వీట్‌ని ప్రశ్నగా అడిగారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్‌ తన ట్వీట్టర్‌ ఖాతాలో మెడిసిన్‌ పదాలు రాసి వీటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా ? అంటూ ట్వీట్‌ చేశారు. దానికి శశి ధరూర్‌ అయితే సరిగ్గా సమాధానం చెప్పగలరంటూ ఆయనని ట్యాగ్‌ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ ఈ షోలో ప్రశ్నగా మారింది. కొవిడ్‌ 19 మెడిసిన్‌ లిస్ట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వీరిలో ఎవరికి ట్యాగ్‌ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నాలుగురి పేర్లను ఆప్షన్స్‌గా ఇచ్చారు. దీనిపై సౌరవ్‌ శశి థరూర్‌ అని చెప్పారు. అయితే తను చేసిన ట్వీట్‌ కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ప్రశ్నగా రావడంతో తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందించారు. దాదా, సెహ్వాగ్‌ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img