కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆపాలని ఎమ్మెల్యే సీతక్క హితవుపలికారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని అన్నారు. కేసీఆర్ జంతర్మంతర్ దగ్గర ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. 10 వేల కోట్లు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు.ముందు వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనాలని డిమాండు చేశారు.