Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కేసీఆర్‌ అబ్బ సొత్తా? చంద్రబాబు వ్యాఖ్యలపై షర్మిల కామెంట్స్‌

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని, టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపైనే అంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్‌ షర్మిల స్పందించారు. శుక్రవారం పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. తెలంగాణకు ఎవరైనా రావొచ్చని, ప్రజల మనస్సులను గెలుచుకోవచ్చంటూ బాబు వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ అబ్బ సొత్తా? అంటూ ప్రశ్నించారు.అలాగే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై షర్మిల స్పందించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుంటే.. కేసీఆర్‌ దాక్కుంటున్నారని, మోదీని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై నిలదీయాల్సిన కేసీఆర్‌.. పట్టించుకోకుండా డ్రామాలాడుతున్నారంటూ ఆరోపించారు. మోదీని కలిసే దమ్ము కేసీఆర్‌కు అసలు లేదని షర్మిల విమర్శించారు. మోదీని కేసీఆర్‌ కలిసి రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించాలని ఆమె డిమాండ్‌ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం లేదని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీజేపీకి ఏమైనా వాటా ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టే పథకాల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని, సొంత ఆస్తులను పెంచుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img